గూడు

ఈ రోజు ఆదివారం అంధ్రజ్యొతి లొ కథ గూడు చదివాను. వాస్తవాన్ని అద్దం పట్టినట్టుగా ఉంది.
ఎంత నిజం? థండాలలో\ పల్లెటూర్లలొ ఇల్లు కట్టడం అంటే మాటలా?

పల్లెటూరి సమస్యలు చిత్రంగా ఉంటాయి, మొదట చూసినప్పుడు వాల్ల మీద అసహ్యం కొపం వికారం లాంటివి కలుగుతాయి.

కాని పెదరికం వాల్ల జీవితాలని బలి తీసుకుంటొంది. చాలా కష్తం పెదరికం లొ బతకడం. ఎదో ఆర్తికల్ చదివి సమ్మరి చెప్పడం అని కాదు,నిజం అనుభవం తో చెబుతున్నా. మొన్నటి దాక మట్టి మిద్దె ఇంట్లోనె గడిపాను. 2 సంవత్సరాల ముందు అనుకుంటా దీపావళి రొజు వర్షం వచ్చి రాత్రి మొత్తం ఇంత్లొ పొటుకు. వర్షం నీల్లతో ఇల్లంతా నిందిపొయింది. ఉదయాన్నె చూస్తె చిన్నన్న వాల్ల దొడ్లొకి నీళ్లు పొతున్నయని గొదవకొచ్చాడు. బాధ, కోపం కలగలిపిన మనసుతో పేరంట్స్ కి ఊల్లొ ఇళ్లు కట్టాలని నిర్ణయం.

ఎదొరకంగా ఇల్లైతె కట్టాను కాని అప్పుల్లొ కూరుకొని పొయాను. నాన్ననెమో అనుభవం లెకపొవడంతో డబ్బులు దుభారాగ ఖర్చు చెసాడు.

సరే ఇదంతా సొధి ఎందుకు ఇప్పుడు?

కథకి దీనికి సంబధం ఉంది.ఇందిరమ్మ పథకం అంటూ కెంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎదో పథకాన్ని పెరు మార్చి 30 వేలతో ఇల్లు కట్టుకొమనడం ఊ పెద్ద జొకు. సాఫ్త్ వెరు ఉద్యొగం వెలగబెడుతూ ఇల్లుకట్టడానికి అప్పుల్లొ కూరుకొని పొతే మాములు వ్యక్తి 30 వేలతొ ఇల్లు కట్టుకొమనడం పెదరికాన్ని అపహస్యం చెయడమే.

వాల్లకి ఎమీ తెలిదు. రొజంతా కస్తపడటం, కూలి దబ్బులని కల్లు/సారా దుకనంలో పెట్టడం మాత్రమే వాల్లకి తెలుసు. 30 వేలతో మాజిక్ చెసి ఇల్లుకట్టుకొవడం వల్లకి తెలుదు.

బుద్ది ఉన్న ప్రభుత్వం చెయల్సిన పని సరైన ఈంజనీరింగ్ ప్లాను వెసి చీపుగా ఇల్లు ఎలా కట్టలో కనుక్కొని ఎన్నికచెసిన అర్హులకి ఇల్లు కట్టి ఇవ్వడం.

ఎదో కొంత డబ్బు మొహన కొట్టి పని అయిపొయిందని అనుకుంటున్న రాజశెకరుడు ఇంకో సారి రాష్త్రం మొత్తం నడిచినా పెదరికాన్ని అర్థం చెసుకొవడం కస్టం. ఆకలి విలువ ఆకలి ఉన్నవాడికే తెలిసినట్టు పెదరికం విలువ వెండి చెంచాతో పుట్టిన ఆయనకి అర్థం కావడం చాల కష్తం.

Comments

హరినాథ్ గారూ,
మీరు తెలుగులో బ్లాగు మొదలు పెట్టడం సంతోషం. మీ అనుభవాలతో ఆలోచనలతో ఇలా సాహిత్యాన్ని జోడిస్తూ రాయడం చాలా బాగుంది. నిజంగా సమస్యల్ని, ముఖ్యంగా పేదరికాన్ని నిర్మూలించాలనే బుద్ధి మన ప్రభుత్వాలకీ, రాజకీయులకీ లేదనేది స్పష్టం. రాజుల సొమ్ము రాళ్ళపాలు అన్నట్టు కొన్ని వేల కోట్ల రూపాయలు అర్థం లేని స్కీములకింద వృధావ్యయం అవుతున్నాయి.
మా యింటికి కూతవేటు దూరంలో ఈ కథలో చెప్పిన ప్రజల ఇళ్ల గుంపు ఉంది. అక్కడా ఇదే పరిస్థితి. మా వల్లకాదని చేతులెత్తేసేవారే ఎక్కువ. వారిలో కువైట్ వెళ్లి సంపాదించినవారు మాత్రం ఈ స్కీమువల్ల లాభపడ్డారు. అటూ ఇటూ ఊగిసలాడినవారు అప్పలపాలయ్యారు. కొందరి ఇళ్లు సగం పూర్తయేసరికి తాము దివాలా తీశామన్న సంగతిని జీర్ణించుకోవడానికి నానా అవస్థలూ పడ్డారు. దీనికితోడు ఆమ్యామ్యాలకోసం వీళ్లను కాల్చుకుతినే అధికారులు. ఏమైతేనేం కొంతమందికి ఇళ్లైతే వస్తాయిగానీ బతుకుల్లో సంతోషం పోతుంది. కథలో చెప్పినట్లూ మీరన్నట్లూ అనుభవించినవాడికిగానీ అర్థంకాదు.
cbrao said…
హరినాథ్ గారు, మీ అనుభవాలను తెలుగులో చక్కగా చెప్పారు. మీరు మీ తెలుగు టపాలకు ప్రత్యేక బ్లాగు ప్రారంభించండి. కూడలి లో మీ తెలుగు బ్లాగు కు ప్రత్యేక స్థానం ఉంటుంది. మీ బ్లాగుని కూడలిలో చేర్చాలనుకుంటే, veeven at gmail dot com కి మీ బ్లాగు URL ని మెయిల్ చేయండి. మీరు కూడలిని ఇక్కడ చూడవచ్చు.http://koodali.org/
maa godavari said…
హరినాధ్ గారూ
మీ బ్లాగులో గూడు కధ గురించి రాసిన విషయాలు,మీ సొంత సమస్య గురించి చదివాను.
మీకు నా హ్రుదయపూర్వక క్రుతజ్ఞతలు.
నిజమే ప్రపంచీకరణ పుణ్యమా అని పల్లెటూళ్ళు అల్లకల్లోలమౌతున్నయి.
ఇక తండాల్లో బతుకుతున్న వారి పరిస్థితి దీనాతి దీనంగా తయారైంది. నా కధ వచ్చిన రోజునే మరో వార్త ఒకటి వచ్చింది.ఈ కధకి కాంట్రాస్టుగా ఉందా వార్త.అదేమిటంటే ముఖేష్ అంబాని 650 కోట్లతో తన కొత్త ఇల్లు కట్టుకుంటున్నడని.5000/ కి గతిలేని పేదలు ఒకవైపు, కోట్లకు పడగలెత్తుతున్న దుర్మార్గపు కార్పోరేట్ కసాయిలు ఒకవైపు. ఈ అంతరాలు ఇంకా ఇంకా పెరుగుతాయి. పేదల బతుకులు మరింత దుర్భరమౌతాయి.
ఇక మా సమ్మర్ కాంప్ గురించి నేను ఉండేది కుందంబాగ్ లో.అంటే బేగంపేట్లో.మీరు చెప్పింది కరక్టే.కుందంబాగ్ లైఫ్స్తైల్ కి వెనకే ఉంది.ఇక్కడి నుంచి కొంచం లెఫ్ట్ కి వెళితే మక్తా అని ఒక స్లం వస్తుంది.అక్కడే మేము క్యాంప్ పెట్టేం. శనివారం దాన్ని క్లోస్ చేసేసాం కూడా.
VIJAYABHASKAR said…
హరినాథ్ గారు తెలుగు భాష లొ మీ బ్లాగ్ హౄదయాన్ని కదిలించింది. ఆ గ్రీన్ లాండ్స్ Y ఎస్ ఆర్ మీ బ్లాగ్ చదివితే తెలుస్తుంది సగటు మనిషి వేదన..

Popular posts from this blog

The Mumbai trip

Garden Arbor

Indiatoday book club lottery - a 419 cheating